
దుబాయ్ నుంచి వచ్చిన ఆ దంపతులకు ఎయిర్పోర్టులో చేసిన స్ర్కీనింగ్లో కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదు. ఇంటి కొచ్చిన రెండో రోజే భర్తకు దగ్గు, జలుబు మొదలయ్యాయి. దీంతో ఆయన కొడుకు సందీప్ ను గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్లా రు. తన తండ్రికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు డాక్టర్లు చెప్పడంతో సందీప్ షాకయ్యారు. తర్వాత తనకూ వైరస్ సోకిందని తెలిసింది. తండ్రి ఉన్న వార్డులోనే ఉంచారు. రాష్ట్రంలో లోకల్గా వైరస్ ఇన్ఫెక్ట్ అయిన తొలి వ్యక్తి కూడా తనే. ఆ తర్వాతి రెండ్రో జులకే తన తల్లికి కూడా వైరస్ నిర్దారణ అయింది. కానీ, ఈ సారి సందీప్ షాక్ అవ్వలేదు. కరోనాతో భయం లేదని, అప్పటికే తను అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. తల్లి, తండ్రితో పాటు తనూ వైరస్ను జయించి, శనివారమే గాంధీ హాస్పిటల్నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సందీప్ తన అనుభవాలను ‘వెలుగు’తో పంచుకున్నారు.
‘‘దుబాయ్ లో ఉన్న సిస్టర్ వాళ్ల ఇంటికి అమ్మ, నాన్న హాలిడే ట్రిప్కోసం వెళ్లారు. అక్కడే 14 రోజులు ఉండి, మార్చి 14న రాత్రి హైదరాబా ద్కు వచ్చారు. అప్పుడు ఇండియాలో కరోనా ఈ స్థాయిలో లేదు. కానీ, మీడియాలో వస్తున్న వార్తలతో దాని గురించి తెలుసుకున్న. ఇంటికొచ్చిన రెండ్రోజుల తర్వాతే నాన్నకు లైట్గా దగ్గు, జలుబు స్టార్ట్ అయ్యాయి. ఎందుకైనా మంచిదని అంబులెన్స్కి కాల్ చేసి, గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లా. నాన్నకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు డాక్టర్లు చెప్పడంతో, కొంత షాక్అయ్యా. ఆయన్ను(పేషెం ట్ 14) అక్కడే అడ్మిట్ చేసుకున్నారు. మా ఇంట్లో అందరం క్వారంటైన్లోకి వెళ్లిపోయాం.
నాన్నను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన మరుసటి రోజే నాకూ బాడీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ విషయాన్ని డాక్టర్స్ తో చెబితే టెస్టులు చేయించారు. నాకు కూడా వైరస్ పాజిటివ్ రావడంతో నాన్న ఉన్న వార్డులోనే నన్నూ అడ్మిట్ చేశారు. క్వారంటైన్లో ఉండాలని అమ్మనాన్నకు ఎయిర్పోర్టులో ఎవరూ చెప్పకపో వడం వల్ల, వాళ్లతో మేము క్యాజువల్గానే ఉన్నం. నాకు పాజిటివ్ వచ్చాక మా ఫ్యామిలీలో అందరికీ టెస్టులు చేశారు. రెండ్రోజుల తర్వాత అమ్మ(పేషెం ట్25)కూ వైరస్ పాజిటివ్ వచ్చినట్టు చెప్పారు.
హాస్పిటల్లో అన్నీ బాగున్నాయి
గవర్నమెంట్ హాస్పిటల్కు వెళడ్లం లైఫ్లో ఇదే ఫస్ట్టైమ్. అక్కడ ఎలా ఉంటుందో అని భయ మేసింది. కానీ, అక్కడ వార్డులన్నీ చాలా నీట్గా ఉన్నాయి. అమ్మ, నాన్న, నాకు కలిపి ముగ్గురికీ ఒక పెద్ద రూమ్ కేటాయించారు. రూమ్లోనే దూరం దూరంగా బెడ్లు వేశారు. రోజూ బెడ్ షీట్లు చేంజ్ చేశారు. మేం వాడిన వస్తువులను శానిటైజ్ చేశారు. రూమ్చాలా నీట్గా ఉంచారు. రోజూ మూడు, నాలుగుసార్లు డాక్టర్లు, నర్సులు వచ్చి చూసేవారు. భయపడాల్సిన అవసరంలేదని ధైర్యం చెప్పేవారు. డాక్టర్ రాజారావు, డాకర్ శ్రావణ్ కుమార్, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. కరోనా పే షెంట్లకు ఇచ్చే ఫుడ్కూడా చాలా బాగుంది. నాన్న 18 రోజులు, నేను 16 రోజులు, అమ్మ 14 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాం. దూరందూరంగానే ఉండి మాట్లాడుకునేవాళ్లం. మొబైల్తోపాటు, ల్యాప్టా ప్తీసుకెళ్లాను. అక్కడి నుంచే నా బిజినెస్ పనులు కూడా చూసుకున్న. ఎక్కువ టైమ్ యూట్యూబ్ సినిమాలు, వెబ్ సిరీస్లు చూస్తూ గడిపా.
పానిక్ కావొద్దు
వైరస్ సింప్టమ్స్ మైల్డ్గా ఉన్నప్పుడే హాస్పిటల్కు రావాడం మాకు మంచిదైంది. స్టార్టింగ్ లో రెండు, మూడు రోజులు పొడి దగ్గు, జలుబుతో ఇబ్బంది పడ్డాను. మెడిసిన్ తీసుకోవడంతో తగ్గిపోయింది. అమ్మ హాస్పిటల్లో చేరేసరికి నాన్న కూడా దాదాపు నార్మల్ అయ్యారు. అందుకే అమ్మకు పాజిటివ్వచ్చినప్పుడు నేను ఎక్కువగా భయప డలేదు. మాకు రోజూ పొద్దున బ్రేక్ ఫాస్ట్ తర్వాత , మధ్యాహ్నం లంచ్ తర్వాత, సాయంత్రం డిన్నర్ తర్వాత ట్యాబ్లెట్లు ఇచ్చేవాళ్లు. మా ముగ్గురికీ సేమ్ మెడిసిన్.. ఒక నాలుగైదు ట్యాబ్లెట్లు కాంబినేషన్ ఇచ్చారు. నాన్నకు 61 ఇయర్స్. బీపీ కూడా ఉంది. ఆయనకు అదనంగా బీపీ ట్యాబ్లెట్ ఇచ్చారంతే. పాజిటివ్ వచ్చిన ఐదారు రోజుల తర్వాత మళ్లీ ఒకసారి టెస్ట్ చేశారు. అందరికీ నార్మల్గానే ఉందని, భయపడాల్సిన అవసరంలేదని చెప్పారు. ఆ తర్వాత వన్ వీక్కి మళ్లీ చేశారు. డిశ్చార్జ్ ముందు వరుసగా రెండ్రోజులు టెస్టుచేశారు. దగ్గు, జలుబు ఉంటే ఎవరైనా స్టార్టింగ్ లోనే వచ్చి టెస్టులు చేపించుకోవడం మంచిది. వైరస్ పాజిటివ్ ఉన్నా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. వైరస్ శరీరంలో అన్ని పార్ట్ లకు స్ప్రెడ్ అయ్యే వరకూ లేట్ చేస్తేనే ప్రమాదం.”