రాజకీయ లబ్ధి కోసమే దళిత బంధు

రాజకీయ లబ్ధి కోసమే దళిత బంధు

రాజకీయ లబ్ధి కోసమే సీఎం కేసీఆర్ దళిత బంధు తెస్తున్నారని అన్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ నెల 18న ర్యావిరాలలో జరిగే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభా స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ(సోమవారం) పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ రాజకీయ స్వార్థం కోసం దళిత, గిరిజన ఓట్ల కోసం దళిత బంధు తెస్తున్నారన్నారని ఆరోపించారు. దళిత బంధు ఒక్క హుజురాబాద్‌లోనే కాదు రాష్ట్రంమంతటా ఒకేసారి అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధు లాగే బీసీబంధు, గిరిజన బంధు లాంటి పథకాలు తేవాలన్నారు. మద్యం బంద్ చేయకపోతే రాష్ట్రంలో ఎన్ని పథకాలు అమలు చేసినా పేదలకు ప్రయోజనం లేదన్నారు సీతక్క.