హరీశ్ రావు రాజీనామాను జేబులో పెట్టుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి

హరీశ్ రావు రాజీనామాను జేబులో పెట్టుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి

ప్రధాని మోదీపై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. చెప్పిన అబద్ధాన్నే మోదీ మళ్లీ చెబుతున్నారని ఫైర్ అయ్యారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలని అన్నారు.  బీజేపీ అభ్యర్థికి అహంకారం ఎక్కువని ఫైర్ అయ్యారు. రైతు కష్టమేమిటో జీవన్ రెడ్డికి తెలుసన్నారు. ఆర్మూర్ లో సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాటపటిమ ఉన్నవాళ్లు ఆర్మూర్ రైతులని అన్నారు. 69 లక్షల మంది రైతులకు రైతుభరోసా ఇచ్చామని తెలిపారు. పంద్రాగస్టు కల్లా రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. హరీశ్ రాజీనామాను జేబులో పెట్టుకోవాలని సిద్ధిపేటకు ఆయన పీడను వదిలిస్తానని చెప్పారు. నల్లా చట్టాలపై మోదీ మెడలు వంచిన చరిత్ర రైతులదని అన్నారు. కోడ్ ముగిసిన వెంటనే చక్కెర రైతులను ఆదుకుంటామని చెప్పారు.

 కేసీఆర్ సవాళ్ల పైన నిలబడే వ్యక్తేనా అని ప్రశ్నించారు. అమరవీరుల స్థుపం కాడ కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని అన్నారు. ఆర్మూర్ కు మున్సిపల్ కార్యాలయానికి రూ, 16 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఒక్క అవకాశం జీవన్ రెడ్డికి ఇవ్వండని కోరారు. పసుపు బోర్డు రావాలంటే కాంగ్రెస్ గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.