కానిస్టేబుల్ అభ్యర్థులకు ట్రైనింగ్ ఇవ్వాలి

కానిస్టేబుల్ అభ్యర్థులకు ట్రైనింగ్ ఇవ్వాలి

సికింద్రాబాద్,వెలుగు :  కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్​ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు వెంటనే ట్రైనింగ్ ఇవ్వాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో సెలెక్టెడ్ అభ్యర్థులు శుక్రవారం నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ 2022 నోటిఫికేషన్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

ట్రైనింగ్ కోసం ఎదురు చూస్తుండగా కొందరు దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు. జీవో 46 ను రద్దు చేయకుండా యధావిధిగా కొనసాగిస్తూ ట్రైనింగ్ కు పంపాలని కోరారు. కానిస్టేబుల్ అభ్యర్థులు నగేష్, చంద్రశేఖర్, శ్రీనివాస్, నీరజ్, వినయ్, ఫిరోజ్, విక్రమ్ ఉన్నారు.