హైదరాబాద్, వెలుగు : టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి శుక్రవారం బీఆర్ఎస్లో చేరనున్నారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండవా కప్పుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రావులతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని, ఆయనకు మహబూబ్నగర్స్థానిక సంస్థల స్థానం నుంచి ఎమ్మెల్సీగా చాన్స్ ఇస్తారని సమాచారం. ఇక తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా శుక్రవారమే బీఆర్ఎస్లో చేరనున్నారు.
మంత్రులు కేటీఆర్, హరీశ్రావు సమక్షంలో ఆయన పార్టీలో జాయిన్ కానున్నారు. గురువారం ఉదయం బేగంపేట క్యాంప్ఆఫీస్లో మంత్రులు కేటీఆర్, హరీశ్రావుతో జిట్టా సమావేశమయ్యారు. పార్టీలోకి రావాలని మంత్రులు ఆహ్వానించగా అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. కాగా..కాంగ్రెస్ నేతలు చెరుకు సుధాకర్, సింగిరెడ్డి హరివర్ధన్రెడ్డి సైతం త్వరలోనే బీఆర్ఎస్లో చేరనున్నారు. కాంగ్రెస్లో టికెట్లు రాని నాయకులను బీఆర్ఎస్లో చేర్చుకునేందుకు ప్రగతి భవన్ ప్రయత్నాలు చేస్తోంది.