ఇవాళ బీఆర్ఎస్​లోకి రావుల, జిట్టా!

ఇవాళ బీఆర్ఎస్​లోకి రావుల, జిట్టా!

హైదరాబాద్, వెలుగు : టీడీపీ పొలిట్​బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్​రెడ్డి శుక్రవారం బీఆర్ఎస్​లో  చేరనున్నారు. ప్రగతి భవన్​లో  సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండవా కప్పుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రావులతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని, ఆయనకు మహబూబ్​నగర్​స్థానిక సంస్థల స్థానం నుంచి ఎమ్మెల్సీగా చాన్స్ ఇస్తారని సమాచారం. ఇక తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్​నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా శుక్రవారమే బీఆర్ఎస్​లో  చేరనున్నారు.

మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు సమక్షంలో ఆయన పార్టీలో జాయిన్ కానున్నారు. గురువారం ఉదయం బేగంపేట క్యాంప్​ఆఫీస్​లో మంత్రులు కేటీఆర్, హరీశ్​రావుతో జిట్టా సమావేశమయ్యారు. పార్టీలోకి రావాలని మంత్రులు ఆహ్వానించగా అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. కాగా..కాంగ్రెస్​ నేతలు చెరుకు సుధాకర్, సింగిరెడ్డి హరివర్ధన్​రెడ్డి  సైతం త్వరలోనే బీఆర్ఎస్​లో చేరనున్నారు.  కాంగ్రెస్​లో టికెట్లు రాని నాయకులను బీఆర్ఎస్​లో చేర్చుకునేందుకు  ప్రగతి భవన్ ప్రయత్నాలు చేస్తోంది.