
‘బట్టల రామస్వామి బయోపిక్’ చిత్రంతో నిర్మాతగా పరిచయమై ప్రస్తుతం వరుస చిత్రాలను నిర్మించే పనిలో ఉన్నారు సెవెల్ హిల్స్ సతీష్. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా అప్కమింగ్ ప్రాజెక్టులను గురించి మాట్లాడుతూ ‘కోవిడ్ టైమ్లో నేను నిర్మించిన ‘బట్టల రామస్వామి బయోపిక్’ ని ప్రేక్షకులు ఆదరించారు. ప్రస్తుతం మరో రెండు చిత్రాలు రిలీజ్కు రెడీగా ఉన్నాయి. వాటిలో ఒకటి ‘కాఫీ విత్ ఏ కిల్లర్’. ఇదొక క్రైమ్ థ్రిల్లర్.
ఈ సినిమాను ఆర్పీ పట్నాయక్ గారు డైరెక్ట్ చేశారు. ప్రేక్షకులకు ఈ చిత్రం డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ను అందిస్తుంది. అలాగే ‘బిగ్ బాస్’ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’ చిత్రాన్ని నిర్మిస్తున్నా. ఈ చిత్రంతో నవీన్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. జీరో టూ హీరో జానర్లో దీన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తాం. ఇందులో శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్స్గా నటించగా, పోసాని కృష్ణ మురళి, అనిత చౌదరి, షఫీ, భద్రమ్ ఇతర పాత్రలు పోషించారు. మరికొన్ని కథలు వింటున్నా. ఇవి విడుదలవగానే వాటిని ప్రకటిస్తాం’ అని చెప్పాడు.