రోజూ వేల మంది ప్రయాణించే ఓల్డ్ సిటీ నుంచి కాకుండా.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి ప్రాంతాల్లో మెట్రో నిర్మిస్తామని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలు ఎక్కువగా ప్రయాణించే ఓల్డ్ సిటీ నుంచే మెట్రోను నిర్మించడానికి నిర్ణయం తీసుకుందని తెలిపారు. హైదరాబాద్ మెట్రోకు మొదట శంకుస్థా పన చేసింది రాజశేఖర్ రెడ్డి హయాంలోనేనని గుర్తుచేశారు.
ఓల్డ్ సిటీ అభివృద్ధికి అడగగానే నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రిని నారాజ్ చేయొద్దని షబ్బీర్ అలీ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, తీగల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.