పేదల కోసమే ఓల్డ్​ సిటీ నుంచి మెట్రో రైలు : షబ్బీర్​ అలీ

పేదల కోసమే ఓల్డ్​ సిటీ నుంచి మెట్రో రైలు : షబ్బీర్​ అలీ

రోజూ వేల మంది ప్రయాణించే ఓల్డ్​ సిటీ నుంచి కాకుండా.. జూబ్లీహిల్స్,​ బంజారాహిల్స్​ లాంటి ప్రాంతాల్లో మెట్రో నిర్మిస్తామని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ విమర్శించారు. కాంగ్రెస్​ ప్రభుత్వం పేద ప్రజలు ఎక్కువగా ప్రయాణించే ఓల్డ్​ సిటీ నుంచే మెట్రోను నిర్మించడానికి నిర్ణయం తీసుకుందని తెలిపారు. హైదరాబాద్​ మెట్రోకు మొదట శంకుస్థా పన చేసింది రాజశేఖర్​ రెడ్డి హయాంలోనేనని గుర్తుచేశారు.

ఓల్డ్​ సిటీ అభివృద్ధికి అడగగానే నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రిని నారాజ్​ చేయొద్దని షబ్బీర్​ అలీ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్​ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూర్​ వెంకట్, నగర మాజీ మేయర్​ బొంతు రామ్మోహన్, తీగల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.