- బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో భారీగా చేరిక
షాద్ నగర్,వెలుగు : కాంగ్రెస్ లో కలిసికట్టుగా ఏకతాటిపై నడుద్దామని.. మంచి రాజకీయాలను ఆస్వాదిద్దామని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. నందిగామ మండలం నుంచి బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరారు. దాదాపు వెయ్యి మందికిపైగా పార్టీలో చేరగా.. మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ డైరెక్టర్లు ఉన్నట్టు ఎమ్మెల్యే శంకర్ తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగిందని చెప్పారు. పార్టీ కార్యకర్తలు పదేండ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని ఇకపై వారికి అండగా నిలబడతానని స్పష్టం చేశారు. మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు నరసింహ, ఎంపీటీసీలు, సర్పంచులు ఉన్నారు.