నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. మూడు రోజుల పాటు అక్కడే చికిత్స తీసుకొని నవంబర్ 3న ఇంటికి చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. నవంబర్ 4,5 తేదీలలో షిరిడీలో జరిగే పార్టీ శిబిరాల్లో శరద్ పవార్ పాల్గొంటారని వెల్లడించాయి.
ఆ తరువాత నవంబర్ 8న నాందేడ్ మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశించనున్న కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలోనూ శరద్ పవార్ పాల్గొంటారని తెలిపింది. అయితే పవార్ ఏ సమస్యతో ఆస్పత్రిలో చేరారన్నది మాత్రం వెల్లడించలేదు. 81 ఏళ్ల శరద్ పవార్ కు ఇప్పటికే మూడు సర్జరీలు జరిగాయి.