ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ (81) హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఒంట్లో కాస్త నలతగా ఉండటంతో సోమవారం ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో జాయిన్ అయినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇంకో రెండ్రోజుల పాటు ఆయన హాస్పిటల్లోనే ఉంటారని, నవంబర్ 3న జరిగే పార్టీ మీటింగ్లో పాల్గొంటారని ఎన్సీపీ జనరల్ సెక్రటరీ శివజీరావ్ గార్జే చెప్పారు. ఒంట్లో కొద్దిగా నలతగా ఉండటంతో పర్సనల్ ఫిజిషియన్ సలహా మేరకు ఆయన హాస్పిటల్లో జాయిన్ అయినట్లు తెలిపారు.
పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ఎవ్వరూ హాస్పిటల్ దగ్గరకు రావొద్దంటూ ఆయన కోరారు. కాగా, పవార్కు కిందటేడాది ఏప్రిల్లో గాల్ బ్లాడర్ సర్జరీ జరిగింది. అలాగే, నోటి పుండుకు సంబంధించిన చికిత్సను శరద్ పవార్ తీసుకున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి.