రామాలయం కట్టడం ద్వారా కరోనా వైరస్ నిర్మూలం అవుతుందని కొందరు భావిస్తున్నారంటూ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి స్పందించారు. పవార్ ప్రకటన శ్రీరాముడికి వ్యతిరేకమని, ప్రధాని వెూడీకి కాదన్నారు. ప్రధాని వెూడీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని, రోజులో నాలుగు గంటలు మాత్రమే నిద్రిస్తారని చెప్పారు. పవార్ ప్రకటన రాముడికి వ్యతిరేకంగా చేసినదే కానీ వెూడీకి వ్యతిరేకంగా కాదని అన్నారు ఉమాభారతి.
అయోధ్యలో రామాలయ శంకుస్థాపన కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు వచ్చే ఆగస్టులో రెండు తేదీలను ప్రతిపాదించడంపై శరద్ పవార్ ఇటీవల మాట్లాడుతూ.. రామాలయం కడితే కరోనా వైరస్ నిర్మూలనవుతుందని కొందరు అనుకుంటున్నట్టు చెప్పారు. లాక్ డౌన్తో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని… ఆ అంశంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని తాము కోరుకుంటున్నామని అన్నారు.