డబ్బులు పంచినట్లు తేలితే ఎన్నికల తర్వాత కూడా చర్యలు

డబ్బులు పంచినట్లు తేలితే ఎన్నికల తర్వాత కూడా చర్యలు

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా  రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్..కమలాపూర్ లో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. హుజురాబాద్ నియోజక వర్గంలోని 306 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు 88 ఫిర్యాదులు అందాయని... వీటిపై అబ్జర్వర్స్ వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు. డబ్బుల పంపిణీపై అందిన ఫిర్యాదులను  కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నామన్నారు. ఓటర్లు చాలా ఉత్సాహంగా ఓటు హక్కు ను ఉపయోగించుకుంటున్నారని ..ఫిర్యాదులపై అందిన విచారణలో నిజాలు తేలితే ఎన్నికల  తర్వాత కూడా చర్యలు ఉంటాయన్నారు శశాంక్ గోయల్.