న్యూఢిల్లీ: వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్లో పోటీపడే టీమిండియాకు శిఖర్ ధవన్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. . ఈ నెల 22 నుంచి జరిగే ఈ టూర్లో పోటీ పడే జట్టును ఆలిండియా సెలక్షన్ కమిటీ బుధవారం ప్రకటించింది. ధవన్కు కెప్టెన్సీ, జడేజాకు వైస్ కెప్టెన్సీ అప్పగించింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్, కోహ్లీ, పంత్, బుమ్రా, షమీతో పాటు పాండ్యాకు రెస్ట్ ఇచ్చింది. ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు ఎంపికవని హుడా, శాంసన్, గైక్వాడ్, అవేశ్ ఖాన్లను ఈ టూర్కు ఎంపిక చేసింది. 2020 డిసెంబర్ నుంచి వన్డేలు ఆడని గిల్కు కూడా అవకాశం ఇచ్చింది.
టీమ్: ధవన్ (కెప్టెన్), జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్, గిల్, హుడా, సూర్యకుమార్, శ్రేయస్, ఇషాన్, శాంసన్, శార్దూల్, చహల్, అక్షర్, అవేశ్, ప్రసిధ్, సిరాజ్, అర్ష్దీప్.