కరోనాతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. చనిపోయిన తమ బంధువుల మృతదేహాలను కొంతమంది తమతమ ఆచారాల ప్రకారం ఖననం చేస్తుంటే.. మరికొంతమంది దహనం చేస్తున్నారు. కానీ ఇక్కడో వింతగా దహనసంస్కారాలు జరిగాయి. కరోనాతో చనిపోయిన తమ వ్యక్తి శవాన్ని ఏకంగా నదిలోనే పడేశారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. బలరాంపూర్ జిల్లాకు చెందిన వ్యక్తి శవాన్ని అతని కుటుంబ సభ్యులే నదిలో పడేశారు. హాస్పిటల్లో చనిపోయిన ఆ వ్యక్తి శవాన్ని కరోనా ప్రోటోకాల్ ప్రకారం కుటుంబసభ్యులకు అప్పజెప్పామని.. కానీ వారే శవాన్ని రాప్తీ నదిలో పడేశారని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో.. కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
A video as turned up online, featuring two men dumping dead body in Rapti river from a bridge in Balrampur district. The victim had earlier succumbed to #CoronaVirus infection. pic.twitter.com/EbpafWzByR
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) May 30, 2021