వైరల్ వీడియో: కరోనా డెడ్‌బాడీని నదిలో పడేసిన బంధువులు

వైరల్ వీడియో: కరోనా డెడ్‌బాడీని నదిలో పడేసిన బంధువులు

కరోనాతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. చనిపోయిన తమ బంధువుల మృతదేహాలను కొంతమంది తమతమ ఆచారాల ప్రకారం ఖననం చేస్తుంటే.. మరికొంతమంది దహనం చేస్తున్నారు. కానీ ఇక్కడో వింతగా దహనసంస్కారాలు జరిగాయి. కరోనాతో చనిపోయిన తమ వ్యక్తి శవాన్ని ఏకంగా నదిలోనే పడేశారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. బలరాంపూర్ జిల్లాకు చెందిన వ్యక్తి శవాన్ని అతని కుటుంబ సభ్యులే నదిలో పడేశారు. హాస్పిటల్‌లో చనిపోయిన ఆ వ్యక్తి శవాన్ని కరోనా ప్రోటోకాల్ ప్రకారం కుటుంబసభ్యులకు అప్పజెప్పామని.. కానీ వారే శవాన్ని రాప్తీ నదిలో పడేశారని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.