కరోనా కాలంలో ఆకు కూరల కొరత

కరోనా కాలంలో ఆకు కూరల కొరత

ఏటా 72వేలటన్నుల లోటు
మరో18,063 ఎకరాల్లో సాగుచేయాలె
ఉద్యానశాఖ రిపోర్ట్ లో వెల్లడి
హైదరాబాద్,వెలుగు:కరోనా కాలంలోఆకు కూరలు తినాలని డాక్ట‌ర్లు చెబుతున్నరు. మాంసాహారంలో కూడా లభించని పోషకాలు కర్రీలీవ్స్లోఉంటాయని నూట్రీషియన్స్ పేర్కొంటున్నారు. రోగ నిరోధక శక్తి కలిగిన పోషకాలు ఉండే ఆకు కూరలనే జనం ప్రిఫర్ చేస్తున్నారు. రాష్ట్రంలో మన అవసరాలకు సరిపడా పండుత లేవని ఉద్యానశాఖ రిపోర్టులో స్పష్టమైంది. 

72,252టన్నుల ఆకుకూరలకొరత…

రాష్ట్రంలో ఆకు కూరలు ప్రజల అవసరాలకు తగినంత పండుతలేవని నివేదికలు చెబుతున్నాయి. ఏడాదికి రా ష్ట్రంలో 1,61,828 టన్నుల ఆకు కూరలు అవసరం. ఏటా 21,208 ఎకరాల్లో 89,577 టన్నులు ఉత్పత్తి అవుతోంది. ఇంకా 72,252 టన్నులు కావాల్సి ఉంది. కొరత తీరాలంటే మరో 18,063 ఎకరాల్లో సాగు కావాలని రిపోర్ట్ చెబుతోంది.

తినాల్సినంత తింటలేం….

ఇండియన్ కౌన్సిల్ ఫ‌ర్ మెడిక‌ల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) గైడ్ లైన్స్ ప్ర‌కారం ఒక వ్యక్తి రోజుకు50 గ్రాముల ఆకు కూరలు తినాలి. కానీ మన రాష్ట్రంలో 24 గ్రాములు మాత్రమే తింటున్నట్లు అగ్రికల్చర్ యూనివర్సిటీ (పీ జేటీఎస్ఏయూ) సర్వేలో తేలింది. అంటే 48 శాతం మాత్రమే వినియోగం ఉంటోంది. రాష్ట్ర ప్రజలు 52 శాతం తక్కువగా ఆకు కూరలు తింటున్నారు.