
ఈ నెల 18 నుంచి న్యూజిలాండ్ జట్టుతో ప్రారంభంకానున్న మూడు వన్డేల సిరీస్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ మొత్తం వన్డే సిరీస్కు దూరమయ్యాడు. వెన్నుగాయం కారణంగా శ్రేయస్ సిరీస్ నుంచి వైదొలిగాడని బీసీసీఐ వెల్లడించింది. శ్రేయస్ ప్లేస్లో రజత్ పాటిదార్ని జట్టులోకి తీసుకున్నట్లుగా బీసీసీఐ చెప్పింది. శ్రేయస్ చికిత్స కోసం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నట్లుగా తెలిపింది. కాగా ఈ నెల 18 నుంచి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరుజట్ల ఆటగాళ్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలలపెట్టారు.
మూడు వన్డేల సిరీస్కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), రజత్ పాటిదార్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్,శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్,మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్,ఉమ్రాన్ మాలిక్.