
హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో కివీస్ తో జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ సెంచరీ బాదాడు. 87 బంతులను ఎదురకున్న గిల్ సెంచరీ సాధించాడు. ఇందులో14 ఫోర్లు, ఓ సిక్సు ఉంది. గిల్ కు ఇది వన్డేలో మూడో సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం టీమిండియా 29 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. క్రీజ్ లో శుభ్మన్ గిల్(100), హార్దిక్ పాండ్య(1) పరుగులతో ఉన్నారు.