
బషీర్బాగ్, వెలుగు: బస్సులో ప్రయాణిస్తున్న ఓ ఎస్ఐ మెడలోంచి గోల్డ్ చైన్ కొట్టేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని సైఫాబాద్ పోలీసులు తెలిపిన ప్రకారం..
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ సీఆర్పీఎఫ్ కాలనీలో ఉండే నేనవత్ చంద్రు నాయక్ (52) బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎస్ఐగా డ్యూటీ చేస్తున్నాడు. ఈ నెల 26న డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో లక్డీకాపూల్ లో బస్సు ఎక్కాడు.
అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వద్దకు చేరుకోగానే, తన మెడలోని తులం బరువున్న గోల్డ్ చైన్ కనిపించపోవడం గమనించాడు. ఆందోళన చెందిన ఎస్ ఐ బస్సులో వెతికినా చైన్ లభ్యం కాలేదు. దీంతో సైఫాబాద్ పోలీసులకు ఫిర్యా దు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.