రోమ్: టాప్ సీడ్, వరల్డ్ రెండో ర్యాంకర్ సిమోనా హలెప్.. ఫస్ట్ టైమ్ ఇటాలియన్ ఓపెన్ టైటిల్ను సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన వుమెన్స్ ఫైనల్లో స్కోరు 6–0, 2-1 ఉన్న దశలో డిఫెండింగ్ చాంపియన్ కరోలినా ప్లిస్ కోవా (చెక్ ) మ్యాచ్ నుంచి వైదొలిగింది. దీంతో హలెప్కు వాకోవర్ విజయం లభించింది. మూడోసారి ఈ టోర్నీలో బరిలోకి దిగిన హలెప్.. 2017, 18లో రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఎడమ తొడకు బ్యాండేజ్ కట్టుకుని బరిలోకి దిగిన ప్లిస్ కోవా మ్యాచ్ మధ్యలో లోయర్ బ్యాక్, అప్పర్ లెగ్ కు ట్రీట్ మెంట్ తీసుకుని మ్యాచ్ ను కొనసాగించింది. అయితే సర్వీస్ల్లో ఇబ్బందులుపడటంతో.. హలెప్ 20 నిమిషాల్లోనే సెట్ ను సొంతం చేసుకుంది.
రెండోసెట్ ఫస్ట్ గేమ్ లోనూ ప్లిస్ కోవా సర్వీస్ను కోల్పోయింది. కానీ వెంటనే పుంజుకుని రెండో గేమ్ లో హలెప్ సర్వ్ను బ్రేక్ చేసి స్కోరును 1–1తో సమం చేసింది. కానీ మూడో గేమ్ లో గాయం తీవ్రత పెరగడంతో మ్యాచ్ నుంచి తప్పుకుంది. ఓవరాల్గా ఈ సీజన్ లో హలెప్కు ఇది వరుసగా 14వ విజయం.
మెన్స్ సింగిల్స్ టైటిల్ను టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో జొకోవిచ్ 7–5, 6–3తో ష్వార్జ్ మెన్ (అర్జెంటీనా)పై గెలిచాడు. మ్యాచ్ మొత్తంలో జొకో 3 ఏస్లు కొడితే, ష్వార్జ్ మెన్ ఒక ఏస్తో సరిపెట్టుకున్నాడు. తొమ్మిది బ్రేక్ పాయింట్ అవకాశాల్లో జొకో ఐదింటిని సద్వినియోగం చేసుకున్నాడు.