ఖరీదైన సింగర్.. షోకి తీసుకునేది రూ.14 కోట్లు.. గ్రామంలో ఉంటూ ఫుడ్ బిజినెస్..

ఖరీదైన సింగర్.. షోకి తీసుకునేది రూ.14 కోట్లు.. గ్రామంలో ఉంటూ ఫుడ్ బిజినెస్..

Arijit Singh News: దేశంలో మ్యూజిక్ ఇండస్ట్రీ రోజురోజుకూ ప్రజల నుంచి ఆదరణ పొందుతోంది. ఈ క్రమంలో స్పాటిఫైలో ఇండియన్ సింగర్ అరిజిత్ సింగ్ కొత్త కింగ్ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరు సింగర్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను సాధించారు. ప్రస్తుతం ఆయనకు స్పాటిఫైలో ప్రపంచ వ్యాప్తంగా కోటి 40 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇంత క్రేజ్ ఉన్నప్పటికీ ఆయన జీవనశైలి, ఆయన ఒక్క షోకి తీసుకునే పేమెంట్ వంటి విషయాలు తెలుసుకుంటే మీ మైండ్ పోతుంది. 

ఆయన పాటలు ప్రస్తుతం చాలా మంది మ్యూజిక్ లవర్స్ గుండెల్లో చోటుదక్కించుకున్నాయి. అతడు పాడిన అనేక లవ్ సాంగ్స్, హార్ట్ బ్రేకింగ్ పాటలు టాప్ ప్లే లిస్టుల్లోకి చేరిపోయాయి. అతను రెండు గంటలు షో నిర్వహించినందుకు ఏకంగా రూ.14 కోట్లు చార్జ్ చేస్తాడని తేలింది. ఇంత సంపాదిస్తున్నప్పటికీ చిన్న గ్రామంలో ఫుడ్ బిజినెస్ చేస్తూ కేవలం రూ.40కే భోజనం విక్రయిస్తుండటం అతని సింప్లిసిటీని సూచిస్తోంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ed Sheeran (@teddysphotos)

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అరిజిత్ సింగ్ మెుత్తం ఆస్తుల విలువ రూ.414 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. అతనికి ముంబైలో రూ.8 కోట్లు విలువైన ఇల్లు కూడా ఉంది. అయినప్పటికీ అతను పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లాలోని చిన్న పట్టణం జియాగంజ్ ప్రాంతంలో నివసిస్తుంటాడు. పైగా మీడియా ముందు కూడా పెద్దగా కనిపించని ఈ స్టార్ సింగర్ ని షోలో దగ్గరి నుంచి చూసేందుకు ప్రీమియం సీట్లను చాలా మంది ఒక్కోటి రూ.16 లక్షలు వెచ్చించి కొనుక్కుంటుంటారు. ఈ డబ్బుతో ఒక కారును కొనుక్కోవచ్చని మనందరికీ తెలుసు. అయితే అతని మ్యూజిక్ చేసే మ్యాజిక్ లో మునిగిపోయేందుకు చాలా మంది డబ్బు లెక్కచేయరని అతని క్రేజ్ చూస్తే తెలుస్తుంది. 

అరిజిత్ సింగ్ ఒక్క షోకు ఆస్కార్ విన్నర్ అయిన్ ఏఆర్ రెహమాన్ కంటే 14 రేట్లు అధికంగా రూ.14 కోట్లు చార్జ్ చేయటం చూస్తుంటే ఆయనకు ఉన్న కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది.