వరద నీటిలో కారుతో స‌హ గ‌ల్లంతైన టీఆర్ఎస్ నేత

వరద నీటిలో కారుతో స‌హ గ‌ల్లంతైన టీఆర్ఎస్ నేత

గాలింపు చర్యలు చేప‌ట్టాల‌ని మంత్రి కేటీఆర్ ఆదేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి టీఆర్ఎస్ నేత జంగపల్లి శ్రీనివాస్ వరద నీటిలో కొట్టుకుపోయారు. ఆదివారం రాత్రి శ్రీనివాస్‌ తన ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో మంథనికి బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా శనిగరం – బద్దిపల్లి రోడ్డులోని మద్దికుంట వాగులో గల్లంతయ్యారు. వెంటనే గమనించిన స్థానికులు ముగ్గురిని రక్షించగా.. కారుతోపాటు శ్రీనివాస్ వరద ఉద్ధృతికి కొట్టుకుపోయారు.

దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి.. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఘటనాస్థలికి సిద్దిపేట ఆర్డీవో చేరుకొని గాలింపు చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఈతగాళ్ల సాయంతో ఆయన కోసం గాలింపు చేపట్టారు.

Sircilla Trs Leader Srinivas Washed Away In Flood Water At Siddipet District