ఎంఈఓ సహా ఆరుగురు టీచర్లు సస్పెన్షన్

ఎంఈఓ సహా ఆరుగురు టీచర్లు సస్పెన్షన్

ఆదిలాబాద్ అర్బన్, వెలుగు: గవర్నమెంట్​స్కూల్​లో మందు తాగి, పేకాట ఆడిన ఎంఈఓ, ఆరుగురు టీచర్లను విద్యా శాఖ ఆర్జేడీ సస్పెండ్​చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా బేల జడ్పీహెచ్ఎస్ హెడ్​మాస్టర్​కోలా నర్సింహులు.. బేల, తాంసి, భీంపూర్ మండలాల ఎడ్యుకేషనల్​ఆఫీసర్. అయితే ఇటీవల బేల స్కూల్​లో చెప్రాల జడ్పీహెచ్ఎస్ హెడ్​మాస్టర్​ జీపీ జ్నానేశ్వర్, బేల జడ్పీహెచ్ఎస్​అసిస్టెంట్ సోనేరావు, బాది యూపీఎస్ అసిస్టెంట్​టి.నర్సింహస్వామి,  సిర్సన్న, కరోని బి ఎంపీపీఎస్ లోని ఎస్ జీటీలు దేవురావు, అనంతరావులతో కలిసి మందు కొడుతూ, పేకాట ఆడారు. సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్​మీడియాలో బాగా వైరల్ ​అయ్యాయి. డీటీఎఫ్​ ఆర్జేడీతోపాటు విద్యాశాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఇష్యూని సీరియస్​గా తీసుకున్న వరంగల్ ఆర్జేడీ కె.లింగయ్య బాధ్యులను డ్యూటీల నుంచి సస్పెండ్ ​చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారని డీఈఓ ఎ.రవీందర్​రెడ్డి తెలిపారు.