ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌‌లో మంధానకు మూడో ర్యాంక్‌

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌‌లో మంధానకు మూడో ర్యాంక్‌

దుబాయ్‌‌: ఇండియా విమెన్స్‌‌ టీమ్‌‌ స్టార్‌‌ ఓపెనర్‌‌ స్మృతి మంధాన కెరీర్‌‌ బెస్ట్‌‌ ర్యాంకింగ్‌‌ పాయింట్లను సాధించింది. మంగళవారం విడుదల చేసిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌‌లో మంధాన మూడో ర్యాంక్‌‌ను మరింత పదిలం చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో 741 పాయింట్లు ఉన్నాయి.

రెండో టీ20లో ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌గా నిలవడంతో స్మృతి ఖాతాలో మరో 11 పాయింట్లు చేరాయి. ఇండియా బ్యాటర్లు షెఫాలీ వర్మ (651), జెమీమా రొడ్రిగ్స్‌‌ (624) ఆరు, తొమ్మిదో ర్యాంక్‌‌ల్లో కొనసాగుతున్నారు. బౌలింగ్‌‌లో దీప్తి శర్మ (732), రేణుకా సింగ్‌‌ (712) వరుసగా మూడు, నాలుగో ర్యాంక్‌‌ల్లో ఉన్నారు.