ఇదేందయ్యా ఇది: ఆన్ లైన్‎లో ట్యాబ్ఆర్డర్ చేస్తే సబ్బులొచ్చినయ్

ఇదేందయ్యా ఇది: ఆన్ లైన్‎లో ట్యాబ్ఆర్డర్ చేస్తే సబ్బులొచ్చినయ్

కూకట్​పల్లి, వెలుగు: ఆన్​లైన్‎లో ట్యాబ్ కోసం ఆర్డర్ ​చేస్తే ఓ వ్యక్తికి సబ్బులొచ్చాయి. దీనిపై సదరు సంస్థను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాద్ కేపీహెచ్‎బీ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.  శ్రీనివాసనగర్‎కు చెందిన సుబ్బారావు ఇటీవల అమెజాన్​ఈ కామర్స్ సైట్‎లో ట్యాబ్ ఆర్డర్ ​చేశాడు. 

ఇందుకోసం కోసం ఆన్​లైన్‎లో రూ. 18 వేలు చెల్లించాడు. కొన్ని రోజుల తర్వాత వచ్చిన పార్సిల్‎ను ఓపెన్​ చేసి చూస్తే, అందులో లైఫ్​బాయ్​సబ్బులు ఉన్నాయి.  సదరు సంస్థను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో బాధితుడు కేపీహెచ్‎బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు 
చేస్తున్నారు.