
కూకట్పల్లి, వెలుగు: ఆన్లైన్లో ట్యాబ్ కోసం ఆర్డర్ చేస్తే ఓ వ్యక్తికి సబ్బులొచ్చాయి. దీనిపై సదరు సంస్థను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. హైదరాబాద్ కేపీహెచ్బీ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాసనగర్కు చెందిన సుబ్బారావు ఇటీవల అమెజాన్ఈ కామర్స్ సైట్లో ట్యాబ్ ఆర్డర్ చేశాడు.
ఇందుకోసం కోసం ఆన్లైన్లో రూ. 18 వేలు చెల్లించాడు. కొన్ని రోజుల తర్వాత వచ్చిన పార్సిల్ను ఓపెన్ చేసి చూస్తే, అందులో లైఫ్బాయ్సబ్బులు ఉన్నాయి. సదరు సంస్థను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో బాధితుడు కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు
చేస్తున్నారు.