కరోనా భయంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సూసైడ్

కరోనా భయంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సూసైడ్

హైదరాబాద్, వెలుగు: కరోనా సోకిందనే భయంతో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. సైబరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. క్యాప్ జెమినీలో సీనియర్ కన్సల్టెంట్ గా పని చేస్తున్న శిల్పా గోపి రెడ్డి(37) నార్సింగి అల్కాపురి టౌన్ షిప్లో భర్త, కొడుకుతో కలిసి ఉంటోంది. రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు కరోనా టెస్టు చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో హోం ఐసోలేషన్ లో భర్త, కొడుకుకు దూరంగా ఉంది. కరోనా వచ్చిందనే మనస్తాపంతో బెడ్ రూమ్లోని ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం కోసం డెడ్ బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించారు. భర్త స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..