
చంద్రగ్రణం ముగిసింది. మళ్లీ ఈ నెలలోనే సూర్యగ్రహణం రాబోతుంది. ఈ ఏడాది ( 2025) రెండోసారి సూర్యగ్రహణం ఈ నెల 21 వ తేదీన రాత్రి సమయంలో సంభవించనుంది. రాత్రి 10.59 గంటలకు కన్యారాశిలో ప్రారంభమైన సూర్యగ్రహణం.. సెప్టెంబర్ 22 వ తేది తెల్లవారుజామున 3.23 గంటలకు ముగుస్తుంది. పితృపక్షం చివరి రోజున ( సెప్టెంబర్ 21 ) వచ్చే ఈ సూర్యగ్రహణం కన్య, ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జరుగుతుంది.
ఇది ఈ ఏడాది (2025)లో చివరి సూర్యగ్రహణం . మరల ఇంత పెద్ద సూర్యగ్రహణం .. 2027 ఆగస్టు 2వ తేదీన సంభవిస్తుంది. సూర్యగ్రహణం ఈ దశాబ్దంలోనే అతి పెద్దది అని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2025 సెప్టెంబర్ 21న ఏర్పడే ఈ పాక్షిక సూర్యగ్రహణం భారతదేశంలో కనపడదు.
ఎక్కడ కనపడుతుందంటే..
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అట్లాంటిక్ మహాసముద్రం, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం లాంటి ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. కాని భారత్ లో ఈ సూర్యగ్రహణం కనిపించదు కావున.. సూతకాలం వర్తించదని పండితులు చెబుతున్నారు.