ఘనంగా కార్గిల్ విజయ్ దివస్

ఘనంగా కార్గిల్ విజయ్ దివస్

కశ్మీర్ కొండల్లో కార్గిల్ విజయ్ దివస్ ను సైనికులు ఘనంగా జరుపుకున్నారు. కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్పై భారత్ సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుంటూ స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. కార్గిల్ వార్ లో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్లకు నివాళులు అర్పించారు. శ్రీనగర్లోని కమ్కారి నివాసితులతో ఆర్మీ జవాన్లు కర్గిల్ విజయ్ దివస్  వేడుకలను చేసుకున్నారు. ఈ సందర్భంగా టోలోలింగ్, టైగర్ హిల్‌లో కార్గిల్ యుద్ధం  డాక్యుమెంటరీని ప్రదర్శించారు.

లద్ధాఖ్లోని కార్గిల్ జిల్లా ద్రాస్ లో కార్గిల్ దివస్ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది & వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ ఎస్ ప్రభాకరన్  మోటార్ సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. నేషనల్ వార్ మెమోరియల్ నుంచి కార్గిల్ వార్ మెమోరియల్ వరకు ర్యాలీ నిర్వహించారు.