భారత్ జోడో యాత్రలో పాల్గొనొద్దని చెప్పిన్రు : కమల్ హాసన్

భారత్ జోడో యాత్రలో పాల్గొనొద్దని చెప్పిన్రు : కమల్ హాసన్

భారత్ జోడో యాత్రలో పాల్గొనద్దని కొంతమంది చెప్పారని కమల్ హాసన్ తెలిపారు. యాత్రలో పాల్గొంటే రాజకీయ భవిష్యత్ దెబ్బతింటుందని అన్నారన్నారు. అయితే యాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందని కమల్ తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఢిల్లీలో రాహుల్ వెంట ఆయన నడిచారు. ‘‘ నేను భారతీయుడిని ఎక్కడికైనా వెళ్తా. నాకు దేశమే ఫస్ట్..అన్ని పార్టీలు నావే. మా నాన్న కాంగ్రెస్ వాది ’’ అని కమల్ అన్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఇవాళ ఢిల్లీలోకి ప్రవేశించింది. ఢిల్లీ వీధుల్లో కిక్కిరిసిపోయే జన సందోహం మధ్య ఆయన యాత్ర కొనసాగుతోంది. సోనియా, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా జోడోయాత్రలో పాల్గొన్నారు. ఇక డిసెంబర్ 16 నాటికి రాహుల్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది.