బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఆయనను క్రిటికల్ కేర్ యూనిట్ నుంచి ప్రైవేట్ రూమ్ కు తరలించామని చెప్పారు. దీనికి సంబందించి ఆస్పత్రి డాక్టర్లు బులెటిన్ విడుదల చేశారు. గంగూలీకి నిన్న(గురువారం) రెండోసారి యాంజియోప్లాస్టీ నిర్వహించారు.
నిన్న రెండు స్టెంట్లను వేశామని…ప్రస్తుతం గంగూలీ పూర్తి అబ్జర్వేషన్ లో ఉన్నారని తెలిపారు డాక్టర్లు.