ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 ప్రారంభమైంది. కటక్ వేదికగా మంగళవారం (డిసెంబర్ 9) జరుగుతున్న ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ ఏడాది టీమిండియా ఆడుతున్న చివరి సిరీస్ ఇదే. ఆసియా కప్, ఆస్ట్రేలియాపై సిరీస్ గెలుచుకున్న తర్వాత భారత జట్టు ఈ మ్యాచ్ లో చాలా కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగుతోంది. మరోవైపు సౌతాఫ్రికా సొంతగడ్డపై భారత జట్టుకు ఎలాగైనా షాక్ ఇవ్వాలని చూస్తోంది.
స్వదేశంలో వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్కు డిఫెండింగ్ చాంపియన్ ఇండియా అధికారిక సన్నాహాలు మొదలుపెట్టబోతున్నది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో టీ20 మ్యాచ్ కు సిద్ధమైంది. మంగళవారం జరిగే తొలి మ్యాచ్లో ప్రొటీస్తో తలపడనుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్తో మరో ఐదు మ్యాచ్లు ఆడనున్న టీమిండియా.. నేరుగా వరల్డ్ కప్లో బరిలోకి దిగనుంది. మెగా కప్లో ఫిబ్రవరి 7న అమెరికాతో తొలి మ్యాచ్ ఆడనుంది. దాంతో రాబోయే 10 మ్యాచ్ల్లో జట్టు కూర్పు, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వంటి అంశాలపై దృష్టి పెట్టనుంది.
సౌతాఫ్రికా (ప్లేయింగ్ XI):
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, లూథో సిపమ్లా, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే
ఇండియా (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి, అర్ష్దీప్ సింగ్

