తొమ్మిదో టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇండియా గురి..నేడు కువైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ‘శాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

తొమ్మిదో టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇండియా గురి..నేడు కువైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ‘శాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     నేడు కువైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ‘శాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బెంగళూరు: సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛెత్రి కెప్టెన్సీలోని ఇండియా ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరో ట్రోఫీపై గురి పెట్టింది. సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏషియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (శాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరిన డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా తొమ్మిదోసారి విజేతగా నిలవాలని చూస్తోంది. మంగళవారం ఇక్కడి కంఠీరవ స్టేడియంలో జరిగే ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కువైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించి టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సొంతం చేసుకోవడమే టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగనుంది. హోరాహోరీగా సెమీఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లెబనాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించిన ఆతిథ్య జట్టు 13వ సారి ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరగా.. కువైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1–0తో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నెగ్గి ముందుకొచ్చింది. ఈ టోర్నీలో ఇండియా, కువైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోటీ పడటం ఇది రెండోసారి కానుంది. గత వారం గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఎలో భాగంగా జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1–1తో డ్రాగా ముగిసింది. 

సొంత అభిమానుల మద్దతుతో టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియాదే పైచేయిలా కనిపిస్తోంది. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కువైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో రెండు ఎల్లో కార్డులు ఎదుర్కొన్న కారణంగా సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉన్న కీలక డిఫెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝింగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాకతో జట్టు బలం పెరగనుంది. రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల బ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోచ్ స్టిమాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా దూరంగా ఉండనున్నాడు. అయితే, లెజెండరీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛెత్రి అద్భుతంగా ఆడటమే కాకుండా జట్టునూ ముందుకు నడిపిస్తున్నాడు. గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దశలో వరుసగా మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో గోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన అతను సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేదు. అయితే, షూటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాణించిన అతను ఫైనల్లో తనదైన జోరు చూపెడితే జట్టుకు తిరుగుండదు. అబ్దుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,ఉదాంత సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా రాణిస్తే ఇండియా ట్రోఫీని నిలబెట్టుకోగలదు.