అఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్కు కరోనా

అఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్కు కరోనా

లక్నో : యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి, ఎస్పీ మాజీ ఎంపీ డింపుల్ యాదవ్ కరోనా బారిన పడ్డారు. డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఆమెకు వైరస్ సోకింది. దీంతో ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నారు. కరోనా సోకినప్పటికీ ఎలాంటి లక్షణాలు కనిపించడంలేదని, ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఐసోలేషన్ లో ఉన్నట్లు డింపుల్ ట్వీట్ చేశారు. ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారందరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని కోరారు. డింపుల్తో పాటు ఆమె కుమార్తెకు సైతం కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.

For More news

కరోనాపై రేపు ప్రధాని మోడీ సమీక్ష

నేటి నుంచి మహా అసెంబ్లీ.. 10 మందికి పాజిటివ్