రైల్వే ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేస్తోంది రైల్వేశాఖ. ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇవాళ(మార్చి-8) మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొన్ని రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. అంతే కాకుండా భారత రైల్వేలో 14 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, అందులో లక్ష మంది మహిళలు ఉన్నట్లు, వీరి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు తెలిపారు. మహిళా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రిజర్వేషన్ కోటాను అమలు చేస్తున్నట్లు, అంతేకాకుండా 58 సంవత్సరాలు నిండిన మహిళలకు టిక్కెట్టు ధరలో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. లాంగ్ జర్నీ రైళ్లలో ప్రత్యేకంగా లగేజ్ కమ్ గార్డ్ కోచ్ వెంబడి మహిళా కోచ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా బుకింగ్ కార్యాలయాల కౌంటర్లు, రిజర్వేషన్ కేంద్రాల్లో మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధాన రైల్వేస్టేషన్లలో మహిళా ప్రయాణికుల కోసం వెయిటింగ్ హాళ్లలో శానిటరీ న్యాప్కిన్ డిస్పెన్సర్ అండ్ ఇన్సినీరేటర్లను, అంతేకాకుండా చిన్నపిల్లలకు పాలిచ్చే విధంగా ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది రైల్వే శాఖ.
రైల్వేలో మహిళల కోసం ప్రత్యేక సౌకర్యాలు
- దేశం
- March 8, 2019
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ