‘వెలుగు’కు థ్యాంక్స్ చెప్పిన కుటుంబ సభ్యులు, నేతలు
గండీడ్,వెలుగు: సౌదీలో మృతి చెందిన పాలమూరు జిల్లా మహ్మదాబాద్ మండలం ముందలితండాకు చెందిన నార్య నాయక్ ఫ్యామిలీకి పలువురు దాతలు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం మాజీ ఎంపీపీ శాంతి దాతల ద్వారా వచ్చిన రూ.4.50 లక్షలను మృతుడి భార్య మణెమ్మకు అందజేశారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ నార్య నాయక్ సౌదీలో చనిపోయినా ఎవరూ పట్టించుకోలేదని, చివరి చూపు కోసం ఎదురు చూపు ‘వెలుగు’లో వార్త రావడంతో దాతలు స్పందించి డెడ్వాడీని స్వదేశానికి తీసుకొచ్చారని చెప్పారు. దాతలు ఇచ్చిన విరాళాల ద్వారా రూ.8 లక్షలు రాగా.. నార్యా డెడ్బాడీ తెప్పించేందుకు రూ.3.50 లక్షలు ఖర్చు అయ్యిందని, మిగతా రూ.4.50 లక్షలను మృతుడి భార్యకు అందించామని వివరించారు. ప్రభుత్వం మృతుడి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా శాంతితో పాటు మృతుడి కుటుంబ సభ్యులు ‘వెలుగు’కు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దోమ వెంకటేశ్, అంజానాయక్ పాల్గొన్నారు.