
హైదరాబాద్, వెలుగు: ఆసియా గేమ్స్లో పలువురు తెలంగాణ క్రీడాకారులు పతకాలు నెగ్గడంపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) చైర్మన్ ఆంజనేయ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆసియా గేమ్స్ తెలంగాణ ప్రతిభకు పతకాల పంటగా మారిందన్నారు. ఈ గేమ్స్లో పతకాలు గెలిచిన షూటర్లు ఇషా సింగ్, కైనన్ చెనాయ్, బాక్సర్ నిఖత్ జరీన్, అథ్లెట్ అగసార నందినిని ఆయన అభినందించారు.
ఇంత పెద్ద మెగా ఈవెంట్లో పతకాలు నెగ్గిన వీరంతా రాష్ట్ర యువతలో కొత్త ప్రేరణ కలిగించారని అభిప్రాయపడ్డారు. మహిళలు, యువ క్రీడాకారులైన ఇషా, నిఖత్, నందినికి ప్రభుత్వం మొదటి నుంచి అన్ని విధాలుగా ప్రోత్సాహం అందించిందన్నారు.