వైభవంగా భద్రేశ్వర రథోత్సవం

వైభవంగా భద్రేశ్వర రథోత్సవం

తాండూరు, వెలుగు : తాండూరులోని శ్రీబావిగి భద్రేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి రథోత్సవం నిర్వహించారు. ఆలయం నుంచి బస్వన్న కట్ట వరకు, అక్కడ్నుంచి తిరిగి ఆలయం వరకు రథోత్సవం కొనసాగింది. వేలాదిగా పాల్గొన్న భక్తులు భద్రేశ్వర్ కి జై అంటూ నినాదాలు చేశారు.

రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. తాండూరు, కొడంగల్ తోపాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.