ధోనీ అకౌంట్లో నాలుగు వికెట్లు..లంక స్కోర్ 64/4

ధోనీ అకౌంట్లో నాలుగు వికెట్లు..లంక స్కోర్ 64/4

లీడ్స్: శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో భారత బౌలర్లు రెచ్చిపోయారు. ప్రారంభంలోనే కీలక వికెట్లు తీసి, లంకకు బ్రేక్ వేశారు. అద్భుత ఫామ్‌ లో ఉన్న బుమ్రా శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తున్నాడు. కొత్త బాల్ తో విజృంభించి ఓపెనర్లను పెవిలియన్ పంపి భారత్‌ కు శుభారంభాన్నందించాడు. నాలుగో ఓవర్‌లో దిముత్ కరుణరత్నెను ఔట్ చేసిన బుమ్రా.. ఎనిమిదో ఓవర్‌లో కుశాల్ పెరీరాను వెనక్కి పంపాడు. ఇద్దరు ఆటగాళ్లు కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు.

కష్టాల్లో ఉన్న లంకను ఆవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండీస్ ఆదుకునే ప్రయత్నం చేయగా ఈ జోడీని జడేజా విడదీశాడు. ఈ వరల్ కప్ లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న జడ్డూ తన ఫస్ట్ ఓవర్‌ లోనే వికెట్ తీసి అదరగొట్టాడు. జడేజా వేసిన 11వ ఓవర్ నాలుగో బాల్ ని ముందుకొచ్చి ఆడేందుకు కుశాల్ యత్నించగా.. బాల్ మిస్ కావడంతో ధోనీ స్టంపౌట్ చేశాడు. అయితే కోల్పోయిన 4 వికెట్లు కూడా మిస్టర్ కూల్ ధోనీ అకౌంట్లోనే బడ్డాయి.  క్యాచ్ లు కాగా.. ఒక్క స్టంప్ అవుట్.

16 ఓవర్లు ముగిసేసరికి లంక 4 వికెట్ల నష్టానికి62 రన్స్ చేసింది. మాథ్యూస్(8), తిరుమన్నే(3) క్రీజులో ఉన్నారు.