సోషల్ మీడియాలో భయపెట్టాలని చూస్తున్నరు

 సోషల్ మీడియాలో భయపెట్టాలని చూస్తున్నరు

కృష్ణాజలాలపై ఏపీ వితండ వాదం చేస్తోందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. శ్రీశైలం పూర్తి హైడల్ ప్రాజెక్టు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నిబంధనల ప్రకారమే నీటిని వాడుకొని విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. సెటిలర్ అనే పదం తెరమీదకు తెచ్చి రాజకీయం చేస్తున్నారన్నారు శ్రీనివాస్ గౌడ్. ఉమ్మడి ఏపీలో సీఎంలు ఇచ్చిన జీవోలనే అమలు చేస్తున్నామన్నారు. ఏపీకి చెందినవాళ్లు తమల్ని సోషల్ మీడియాలో భయపెట్టాలని చూస్తున్నా.. పట్టించుకోవడం లేదన్నారు శ్రీనివాస్ గౌడ్.