శ్రీనివాస్ రెడ్డిని ఉరితీయాలంటూ.. బావిలోకి దిగి యువకుల నిరసన

శ్రీనివాస్ రెడ్డిని ఉరితీయాలంటూ.. బావిలోకి దిగి యువకుల నిరసన

యాదాద్రి భువనగిరి: శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలంటూ హజ్ పూర్ గ్రామస్థుల నిరసనలు మిన్నంటుతున్నాయి. ఇప్పటికే దీక్ష చేపట్టిన పలువురిని పోలీసులు గాంధీ హస్పిటల్ కు తరలించగా..శనివారం నలుగురు యువకులు ధర్నాకు దిగారు. అమ్మాయిలను చంపి పాతిపెట్టిన బావిలోకి దిగి నిరసన చేశారు.

తమకు న్యాయం జరగదని కల్పన, శ్రావణీ, మనీషలు చనిపోయిన బావిలోనే తాము చనిపోతామని బావిలో నిరసన చేపట్టారు. బావి దగ్గరకు చేరుకున్న గ్రామస్తులు..నచ్చచెప్పడంతో పైకి వచ్చిన యువకులు.. కలెక్టరేట్ కు బయలుదేరారు. శ్రీనివాస్ రెడ్డిని తక్షణమే ఉరి తీయాలని యువకులు డిమాండ్ చేస్తూ నినాదాలతో జిల్లా కలెక్టర్ దగ్గరకు ర్యాలీగా వెళ్లారు. దీంతో హజీపూర్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.