
- కాళ్లు మొక్కుతానంటూ బీఆర్ఎస్ లీడర్ వీడియో
- అప్పులోళ్లు సతాయిస్తున్నారని ఆవేదన
గద్వాల,వెలుగు: ఎన్నికల్లో నిలబడి అప్పలపాలయ్యా.. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు మీ కాళ్లు మొక్కుతా..నన్ను ఆదుకోండి’ అంటూ గద్వాల టౌన్ రెండో వార్డుకు చెందిన బీఆర్ఎస్ లీడర్ కుమ్మరి బీచుపల్లి ఓ వీడియో పెట్టారు. ఇదిప్పుడు సోషల్మీడియాలో వైరలవుతున్నది. ఆ వీడియో ప్రకారం..చిట్టీలు నడుపుకుంటూ భార్యాపిల్లలతో హాయిగా బతుకుతుండే. పదేండ్లుగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కోసం ఎన్నికల్లో కష్టపడ్డా..గత స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు నాకు గద్వాల టౌన్ మున్సిపాలిటీ రెండో వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ టికెట్ ఇచ్చారు.
ఎన్నికల్లో రూ.25 లక్షల దాకా ఖర్చు పెట్టిన. నాకు వ్యతిరేకంగా ఇండిపెండెంట్ అభ్యర్థిని నిలబెట్టి నన్ను ఓడించారు. అప్పటి ఎన్నికల కోసం చేసిన అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక నా కుటుంబం రోడ్డున పడింది. ఏ బీఆర్ఎస్ లీడర్ నన్ను పట్టించుకోవడం లేదు. అప్పుల వాళ్లు ఇంటి మీదికొచ్చి నా భార్యా పిల్లలను ఇబ్బందులు పెడుతున్నారు. నాకు, మా కుటుంబానికి ఏమైనా జరిగితే అప్పులోళ్లదే బాధ్యత. ఇదివరకే ఒకసారి ఆత్మహత్యయత్నం చేసిన. అప్పులోళ్ల టార్చర్ భరించలేకపోతున్న..ఇక్కడి లీడర్లు నన్ను పట్టించుకోవట్లేదు. కనీసం కేటీఆర్..హరీశ్రావు అయినా నన్ను ఆదుకోవాలె. మీ కాళ్లు మొక్కుతా నన్ను ఆదుకోండి’ అంటూ వీడియోలో వేడుకున్నాడు.