నేడు నర్సింగ్‌ అసోసియేషన్‌.. రాష్ట్రస్థాయి సదస్సు

నేడు నర్సింగ్‌ అసోసియేషన్‌.. రాష్ట్రస్థాయి సదస్సు

పద్మారావునగర్​, వెలుగు: ట్రైన్డ్‌ నర్సెస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (టీఎన్‌ఏఐ) ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ బోయిగూడలోని  రైల్‌ కళారంగ్‌ ఆడిటోరియంలో శనివారం ఉదయం 10 గంటలకు మూడో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నారు. 

‘ఎంపవరింగ్‌ నర్సింగ్‌ స్టూడెంట్స్‌ ప్రాస్పెక్ట్స్ అండ్‌ చాలెంజెస్‌ ’ నిర్వహించే సదస్సుకు మంత్రులు హరీశ్​రావు, తలసాని శ్రీనివాసయాదవ్, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, డీఎంఈ రమేశ్​రెడ్డి, టీఎన్‌ఏఐ సౌత్‌ రీజీయన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జెనీకెంప్, నర్సింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ విద్యుల్లత, టీఎస్‌ఎన్‌ఎంసీ రిజిస్ట్రార్‌ విద్యావతి, అసోసియేషన్‌ ప్రతినిధులు గెస్ట్ లుగా హాజరవుతారని  నిర్వాహకులు రాజేశ్వరి, స్వరాజ్యవాణి తెలిపారు. కార్యక్రమంలో పలు అంశాలపై చర్చించడంతోపాటు ఆటల పోటీల్లో గెలుపొందిన నర్సింగ్‌ విద్యార్థులకు బహుమతులు అందిస్తారు.