- చంద్రబాబుపై అసత్య ప్రచారాలు మానుకోవాలి: టీడీపీ
హైదరాబాద్, వెలుగు: గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా బీఆర్ఎస్కు ఇంకా బుద్ధి రాలేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు. గత కొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబుపై బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో చంద్రబాబుతో సీఎం రేవంత్ రెడ్డి రెండు గంటల పాటు మం తనాలు జరిపినట్లు బీఆర్ఎస్ పత్రిక, ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
మహబూబ్నగర్ జిల్లాలో అభివృద్ధిని విస్మరించారని కేసీఆర్ను రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తే.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, నిరంజన్ రెడ్డి సమస్యను పక్కదారి పట్టించేలా దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. పతనావస్థలో ఉన్న బీఆర్ఎస్పై కుట్ర చేసే అవసరం చంద్రబాబుకు లేదని, తప్పు డు ప్రచారం మానుకోవాలని ఆయన హెచ్చరించారు.