రాష్ట్రంలో తొలి కరోనా వైరస్( కోవిడ్-19) కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అలర్టైంది. గాంధీ, చెస్ట్, ఫీవర్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసింది. దీంతోపాటు వైద్య ఆరోగ్యంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం భేటీ అయ్యింది. దీనికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్.
హైదరాబాద్తో పాటు అన్ని మున్సిపాలిటీల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో హోర్డింగ్లు, వాల్ పోస్టర్లతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్. ‘ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వైరస్ సంక్రమణ అరికడదాం’అనే పోస్టర్ విడుదల చేసింది ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ. వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాల సమాచారం కోసం హెల్ప్లైన్ 040-24651119 నెంబర్ ను సంప్రదించాలని సూచించింది.