హైదరాబాద్: మైనర్ బాలిక కేసులో తన మనవడిపై నా మనవడిపై అసత్య ఆరోపణలు చేశారని, అసలు నిందితులు అరెస్ట్ కావడంతో ఆ ఆరోపణలు తప్పని తేలాయని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. జూబ్లీ హిల్స్ మైనర్ బాలిక అత్యాచార ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రిమహమూద్ అలీ మాట్లాడుతూ... వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి భర్తీ బోర్డు ద్వారా జరిగినందున చైర్మన్ తొలగింపు కూడా బోర్డు పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు పై కేసు వేరు... రాజకీయా సంబంధాలు వేరు అని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. సెల్ ఫోన్ల వల్ల కొన్ని అనర్థాలు జరుగుతున్నాయని, తల్లిదండ్రుల పిల్లల విషయంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఘటనకు సంబంధించి చట్టపరిధిలో పోలీసులు తమ పని తాము చేసుకుంటారని మంత్రి పేర్కొన్నారు.