![వందే భారత్ ఎక్స్ప్రెస్పై మరోసారి రాళ్ల దాడి](https://static.v6velugu.com/uploads/2023/01/Stones-pelted-at-Vande-Bharat-Express-in-Bihar_QWXFKx5o6m.jpg)
వందేభారత్ ఎక్స్ప్రెస్పై మరోసారి రాళ్ల దాడి జరిగింది. బీహార్ లోి కతిహార్ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు వందేభారత్ ఎక్స్ప్రెస్పై రాళ్లు విసిరారు. ఆ దాడిలో రైలు అద్దం పలిగింది. అయితే ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. న్యూ జల్పాయ్గురి నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరిన వందే భారత్ రైలుపై సాయంత్రం 4.25 గంటల సమయంలో డకోలా – టెల్టా స్టేషన్ల మధ్య రాళ్లదాడి జరిగింది. రాయి తగలడంతో సీ6 కోచ్లోని ఓ అద్దం పగిలింది. దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న డకోలా రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు.