వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి జరిగింది. బీహార్ లోి కతిహార్ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు విసిరారు. ఆ దాడిలో రైలు అద్దం పలిగింది. అయితే ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు.  న్యూ జల్పాయ్‌గురి నుంచి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరిన వందే భారత్‌ రైలుపై సాయంత్రం 4.25 గంటల సమయంలో డకోలా – టెల్టా స్టేషన్ల మధ్య రాళ్లదాడి జరిగింది. రాయి తగలడంతో సీ6 కోచ్‌లోని ఓ అద్దం పగిలింది.  దాడి ఘటనపై కేసు నమోదు చేసుకున్న డకోలా రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు.