సుప్రీం ఆదేశాల మేర‌కు గోవ‌ద‌ను ఆపాలి

సుప్రీం ఆదేశాల మేర‌కు గోవ‌ద‌ను ఆపాలి

హైద‌రాబాద్: గోవద నిషేదమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని.. ఆ ఆదేశాలను మ‌న రాష్ట్రంలో అమలు చేయాలని.. గవర్నర్, ముఖ్యమంత్రి, డీజీపీలకు లేఖలు రాశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. హిందువులు దైవంతో కొలిచే ఆవులను హైదరాబాద్ లో వదిస్తున్నారన్నారు. బక్రీ-ఈద్‌కు కనీసం 15 రోజుల ముందు నుంచే గోవదను ఆపాలని..ప్రభుత్వం ఆవు వధను శాంతియుతంగా నిరోధించవచ్చన్నారు. దయచేసి బక్రిద్ వరకు GHMC పారా మిలటరీ దళాలను ఏర్పాటు చేయాలని.. రోడ్డు పక్కన పశువుల అమ్మకాలకు అనుమతించవద్దన్నారు. లేదంటే కరోనా విజృంభించే అవకాశం ఉందన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్.