ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. మే 9వ తేదీ గురువారం సాయంత్రం సరూర్ నగర్ సభలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. ఈ సభ అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి దిల్ సుఖ్ నగర్ దగ్గర సిటీ బస్సు ఎక్కి కొద్ది దూరం ప్రయాణించారు. 

ఈ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.  కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ కరపత్రాలను వారికి అందించారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను రాహుల్, సీఎం రేవంత్ ప్రయాణికులకు వివరించారు. అనంతరం ప్రయాణికులు రాహుల్, రేవంత్ లతో ఫొటోలు దిగారు.