జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో దారుణం జరిగింది. మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామంలో ఒక వ్యక్తిని గ్రామపంచాయతీ ఆఫీసులో కట్టేసి దారుణంగా హత్య చేశారు. గ్రామానికి చెందిన ఆలకుంట చిన్నలక్ష్మయ్య (48) అనే వ్యక్తిని శనివారం అర్ధరాత్రి పంచాయతీ భవనంలోని ఫిల్లర్కు కట్టేసి గొంతుకోసి హతమార్చినట్లు తెలుస్తోంది. గ్రామ సర్పంచ్ ఫిర్యాదుతో ఘటనా స్థలాన్ని అదనపు ఎస్సీ సురేశ్ కుమార్, డీఎస్పీ గౌస్బాబా పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
For More News..