నేతాజీ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడుతాం : ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్

నేతాజీ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడుతాం : ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్

ఖైరతాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో  పోరాడతామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ప్రసాద్ అన్నారు. తెలంగాణ సెంటిమెంట్​తో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ జనాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సోమవారం పంజాగుట్టలోని పార్టీ రాష్ట్ర ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ప్రసాద్ విమర్శించారు. 

నేతాజీ అశయాలను సాధించడానికి, ఆయన అలోచనలను అనుసరించే యువకులు తమ పార్టీతో కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని కోరారు.  వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపిన ఆయన.. సభలకు జాతీయ స్థాయి వామపక్ష నేతలు అటెండ్ అవుతారని వెల్లడించారు. సమావేశంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ హైదరాబాద్ నగర ఇన్​చార్జి రాములు, సనత్ నగర్ సెగ్మెంట్ కన్వీనర్ వెంకటేశ్ పాల్గొన్నారు.