
- ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న సంఖ్య
- ఉమ్మడి జిల్లాలో పెరిగిన18,124 మంది
- మూతపడిన స్కూల్స్రీ ఓపెన్
యాదాద్రి, నల్గొండ, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సర్కారు బడుల్లో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించడం, స్టడీలో క్వాలిటీ పెరగడంతో ఎన్రోల్మెంట్ పెరిగింది. ఫస్ట్ క్లాస్ న్యూ అడ్మిషన్లు నమోదు అవుతుంటే.. పై తరగతులకు సంబంధించి ప్రైవేట్ స్కూల్స్నుంచి వచ్చి చేరుతున్నారు.
బడుల బలోపేతానికి ప్రభుత్వం కృషి..
కొన్నేండ్ల క్రితం సర్కారు బడి తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండేది కాదు. అక్కడక్కడా ప్రైవేట్స్కూల్స్ఉన్నా అవి పరిమితమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వాల కారణంగా క్రమేపీ సర్కారు బడి పరిస్థితి ఆగమైంది. ఉన్న స్టూడెంట్లు ప్రైవేట్స్కూల్స్ వైపు వెళ్లిపోతుంటే.. సర్కారు బడుల్లో చేరే వారే లేకుండా పోయారు. దీంతో సర్కారు బడిలో స్టూడెంట్స్సంఖ్య తగ్గుతూ అనేక స్కూల్స్ మూతబడ్డాయి. ఇటీవల సర్కారు బడుల్లో స్టూడెంట్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. సర్కారు బడుల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ఇంగ్లిష్ మీడియం బోధిస్తున్నారు. కంప్యూటర్లు సమకూర్చడంతోపాటు చదువులో వెనకబడిన వారిలో సామర్థ్యాలు పెంచేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రవేశపెట్టారు. తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్ట్ల్లో ప్రత్యేకంగా బోధిస్తున్నారు. దీనికి తోడు టీచర్లు కూడా తమ వంతుగా కృషి చేస్తున్నారు.
బడిబాటలో చురుగ్గా పాల్గొంటూ ఇంటింటికీ వెళ్లి పేరెంట్స్కలిసి తమ పిల్లలను సర్కారు బడిలో చేర్పించాలని కోరారు. కొన్ని సర్కారు బడులైతే ఏకంగా కరపత్రాలు ప్రింటింగ్ చేయించి పంపిణీ చేశారు. సర్కారు బడిలో టీచింగ్లో నాణ్యత పెరగడంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. అయితే ప్రైవేట్ స్కూల్స్లో ఫీజుల మోత పెరిగింది. పేద, మధ్య తరగతి ప్రజలు మోయలేని స్థితికి చేరుకున్నాయి. ఈ పరిణామాలతో బేరీజు వేసుకున్న ప్రజలు క్రమేపీ సర్కారు బడివైపు చూస్తున్నారు. దీంతో సర్కారు బడుల్లో వేల సంఖ్యలో కొత్తగా ఫస్ట్క్లాస్ అడ్మిషన్లు పెరుగుతూ వస్తున్నాయి. ప్రైవేట్ స్కూల్స్లో వివిధ తరగతులు చదువుతున్న వారు కూడా సర్కారు బడి బాట పట్టారు. మూతపడిన కొన్ని స్కూళ్లనుకూడా తిరిగి తెరిచారు.
యాదాద్రిలో 5306..
యాదాద్రి జిల్లాలో 715 స్కూల్స్ ఉండగా స్టెంత్ తగ్గడంతో 65 స్కూల్స్ను మూసివేశారు. తాజాగా స్ట్రెంత్ పెరగడంతోపాటు మూతపడిన స్కూల్స్లో ఏడింటిని తిరిగి తెరిచారు. ఇప్పుడు జిల్లాలో 657 స్కూల్స్ ఉండగా, ఇప్పటివరకు 5,306 మంది స్టూడెంట్స్కొత్తగా చేరారు. వీరిలో ఫస్ట్ క్లాస్లో 2,473 మంది చేరగా, ప్రైవేట్ స్కూల్స్లో వివిధ తరగతులు చదువుతున్న 2,833 మంది చేరారు. దీంతో స్టూడెంట్ల సంఖ్య 40,312కు చేరింది.
సూర్యాపేటలో 5,289..
సూర్యాపేట జిల్లాలో ఈ ఏడాది కొత్తగా 5,289 మంది స్టూడెంట్లు అడ్మిషన్లు తీసుకున్నారు. 950 సర్కారు బడులు ఉండగా, 75 వేల మంది విద్యార్థులు ఉన్నారు. 5,289 మంది కొత్తగా అడ్మిషన్లు పొందారు. కోదాడ మండలంలో అత్యధికంగా 708, మట్టంపల్లిలో అత్యల్పంగా 79 మంది అడ్మిషన్ తీసుకున్నారు. మూతపడిన 95 స్కూల్స్లో 12 స్కూల్స్ను తిరిగి తెరిచారు.
నల్గొండలో 7529..
నల్గొండ జిల్లాలో మొత్తం 1,484 స్కూల్స్ ఉండగా, 6,1073 మంది విద్యార్థులు ఉన్నారు. జీరో డ్రాప్ అవుట్ స్కూల్స్ 250 ఉన్నాయి. తాజాగా 7,529 మంది కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారు. మరో 2 వేల మంది విద్యార్థులు ఇతర క్లాసుల్లో కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారు. జీరో డ్రాప్ ఔట్ స్కూల్స్ 250 వరకు ఉండగా, ఈ ఏడాది దాదాపు 65 కిపైగా మూత పడిన స్కూల్స్ తెరుచుకున్నాయి. వీటిలో దాదాపు 128 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారు.